Tue Apr 23 2024 19:35:33 GMT+0000 (Coordinated Universal Time)
కోల్కత్తాలో ఫ్లైఓవర్ కూలి 21మంది మృతి!
కోల్ కతాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. నగరంలోని బడాబజార్ ప్రాంతంలోకి గిరీష్ పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కొసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా మరో నూట యాభై మంది వరకూ శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగి మృతదేహాలను వెలికితీస్తున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు చొప్పున పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గాయపడిన కుటుంబాలకు రెండు లక్షలు చొప్పున పరిహారం చెల్లించనున్నారు.
Next Story