జగన్కు పారనోయ వ్యాధి : దేవినేని
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పారనోయ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. పారనోయ వ్యాధి ఉన్న వారు తమను తాము అతిగా ఊహించుకుంటారని., జగన్ ఢిల్లీలో ఉండి ఉంటే తానే ప్రధాన మంత్రినని కూడా అనేవారని ఎద్దేవా చేశారు. జగన్ ఏం చేస్తున్నారో ఆయనకు తెలియట్లేదని విమర్శించారు.
జగన్ అలా అనలేదు..వైసీపీ
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖపట్నం వెళ్లిన జగన్ను పోలీసులు ఎయిర్ పోర్టు రన్వే పై అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్ ముందుకు వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో అతడిని పట్టుకున్న పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియాలలో ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ అని జగన్ అన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటిని జగన్ వెంట ఉన్న వైసీపీ నాయకులు ఖండించారు. ప్రతి పక్ష నాయకుడిని అడ్డుకుంటున్నావ్...., అదే ముఖ్యమంత్రిని అయితే ఇలా పట్టుకుంటావా..., తాము అధికారంలోకి వస్తే అందర్ని గుర్తు పెట్టుకుంటానని మాత్రమే జగన్ అన్నారని., పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారో వీడియోలు చూస్తేనే అర్ధమవుుందని వైసీపీ నేత అంబటి చెప్పారు.
- Tags
- జగన్