Fri Mar 29 2024 12:05:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కీలక భేటీ ప్రారంభం
జగన్ అధ్యక్షతన వైసీపీ నేతలతో కీలక సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక హోదా కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాదయాత్రకు విరామమిచ్చి మరీ జగన్ నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం పెద్దకొండూరులోని వైఎస్ జగన్ బస చేసే శిబిరంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే కేంద్రం ఇచ్చిన నిధులు, విభజన హామీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. సమావేశం తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
- Tags
- జగన్
Next Story