Tue Apr 23 2024 23:39:55 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై లోకేష్ విసుర్లు
అమరావతి అభివృద్ధిని చూసి జగన్ అసూయ పడుతున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. తన తండ్రి రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు అయ్యిందని., రాజకీయ ప్రత్యర్ధులు ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారని చెప్పారు. జగన్ వివిధ సందర్భాలలో చేసిన ఆరోపణలకు మూడు సార్లు సవాల్ విసిరానని కనీసం సమధానం కూడా చెప్పలేకపోయారన్నారు. అర్థం లేని ఆరోపణలతో పుస్తకాలు వేస్తే జనం నమ్మరన్నారు. జగన్ ప్లీనరీలో ఇచ్చిన హామీలన్ని 2014 లో మేము అమలు చేసినవే నని చెప్పారు. జగన్కు తనపై తనకు నమ్మకం లేకనే ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేసారని విమర్శించారు కేవలం చంద్రబాబు ను తిట్టడానికే ప్లీనరీ పెట్టారని., మేము ఇచ్చినప్పుడు నెరవేరని హామీలంటూ విమర్శించిన వారు ఇపుడు అవే హామీలను మ్యానిఫెస్టోలో పెట్టడం రాజకీయ లబ్ది కోసమేనని మండిపడ్డారు.
- Tags
- లోకేష్
Next Story