Fri Apr 19 2024 16:37:46 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వీరాభిమాని ఆత్మహత్య
జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జగనన్న సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొని ఇంటికి చేరుకున్నంత అనంతరం ఆయన సూసైడ్ కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- జగన్ వీరాభిమాని
Next Story