Fri Apr 26 2024 12:13:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పచ్చ కండువా కప్పుకోనున్న నెహ్రు!
వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ నేడు టీడీపీలో చేరనున్నారు. సోమవారం ఉదయం భారీ ర్యాలీగా జగ్గంపేట నుంచి విజయవాడకు బయలుదేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో కీలక నేతగా ఉన్న జ్యోతుల సీఎం చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా కప్పుకోనున్నారు. నెహ్రూ రాకను స్వాగతిస్తూ బెంజ్సర్కిల్ నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. నెహ్రూతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు కూడా టీడీపీలో చేరనున్నారు.
Next Story