పవన్ స్టాండ్ ఎలా ఉండబోతోంది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ ఏం చెప్పబోతున్నారు? సభలో స్పష్టమైన వైఖరిని పవన్ ప్రకటిస్తారా? ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పడం, టీడీపీ కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం, ఏపీలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఉధృతమవ్వడంతో జనసేన అధ్యక్షుడు పవన్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. పవన్ తన స్టాండ్ ఎలా తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన తర్వాత, ప్రత్యేక హోదా కుదరన్న తర్వాత పవన్ తన ఉద్యమ కార్యాచరణ ప్రకటించలేదు. తాను ప్లీనరీలోనే ప్రకటిస్తానని చెప్పారు. మరికాసేపట్లో పవన్ ప్రసంగం ప్రారంభం కాబోతోంది. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగనున్నబహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పవన్ అభిమానులు వచ్చారు. ఇప్పటికే వేలసంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
- Tags
- పవన్