Fri Mar 29 2024 14:48:15 GMT+0000 (Coordinated Universal Time)
మమతకు సవాల్ విసిరిన బిజెపి అద్యక్షుడు!
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా సవాలు విసిరారు. స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ తృణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి తొలగించాలని అమిత్షా కోల్కతాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సవాలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ చేసి పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు లంచం తీసుకుంటున్నట్లుగా వీడియో విడుదలచేసింది. దీంతో పార్టీపై, మమతపై విమర్శలు వెల్లువెత్తాయి.శారదా కుంభకోణంపైనా అమిత్షా విమర్శలు చేశారు. ఈ విషయంలో భాజపా, తృణమూల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవినీతి వ్యతిరేకంగా పోరాడతానని హామీలు ఇచ్చిన మమత బెనర్జీ స్టింగ్ ఆపరేషన్లో దొరికిన నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
Next Story