రోజుకో చర్య తీసుకుంటున్న చంద్రబాబు!
ప్రజలకు ఎదురవుతున్న నోటు కష్టాలను దూరం చేయడం, వీలైనంత త్వరగా రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీల విషయంలో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం అనే దిశగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
నోట్ల మార్పిడి గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏపీలో ఎక్కువగా ఉన్న నోట్ల కొరతను తీర్చడం దగ్గరినుంచి , బ్యాంకుల వద్ద క్యూలైన్లలో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడం వరకు రకరకాల చర్యలు చంద్రబాబు తీసుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకించి ఏపీలో 500 రూపాయల నోట్ల కొరతపై రిజర్వు బ్యాంకు గవర్నర్ తో మాట్లాడి ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను ఆర్బీఐ వద్దకు పంపి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఆ క్రమంలో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు వెల్లడించిన కొత్త ఏర్పాటు రైతులోకానికి కాస్త ఆందోళన తగ్గించే నిర్ణయంగా కనిపిస్తోంది. అన్నదాతలో సహకార బ్యాంకులో రద్దయిన నోట్లతో రుణాలను తిరిగి చెల్లించే ఏర్పాటు కల్పిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటాం అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. నోట్ల మార్పిడి విషయంలో ప్రత్యేకించి వ్యవసాయ రంగంలోని వారికి అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉండడంతో.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
గృహాల్లో సేవింగ్స్ లక్షల్లో కలిగి ఉండే ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో.. కనీసం రైతులందరికీ ఒక వెసులుబాటులాగా చంద్రబాబు సహకార బ్యాంకు రుణాలు కూడా ఈ సొమ్ములతో చెల్లించే ఏర్పాటు చేయడం చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది.