Thu Apr 25 2024 12:27:33 GMT+0000 (Coordinated Universal Time)
వర్మకు వార్నింగ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వంగవీటి రాధాకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో వర్మ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈరోజు వంగవీటి రాధా వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి ఆయన తనయుడు రాధా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడారు. వంగవీటి సినిమా వన్ సైడ్ గా వర్మ తీశాడన్నారు. కేవలం డబ్బుల కోసమే వర్మ సినిమాలు తీస్తున్నాడని చెప్పారు. వర్మ త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా హెచ్చరించారు. మూల్యం అంటే ఏంటన్న విలేకర్ల ప్రశ్నకు త్వరలో మీరే చూస్తారని, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని రాధా అన్నారు. వంగవీటి సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయన్నది వారి ఆరోపణ. రంగాను విలన్ గా చిత్రీకరించారని, వాస్తవ చరిత్రను వర్మ వక్రీకరించారని రంగా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం కల్గించింది.
Next Story