Tue Apr 23 2024 19:19:10 GMT+0000 (Coordinated Universal Time)
వైసిపి నుండి ఆగని వలసలు!
జగన్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జ్యోతుల నెహ్రూ తెలుగు దేశం పార్టీ పలో చేరతారన్న వార్తలకు మరింత బలాన్ని చేరుస్తూ, ఆయన అనుచరుడు ప్రత్తిపాడు ఎమ్మె ల్యే వరుపుల సుబ్బారావు, తాను పార్టీని వీడుతు న్నట్టు వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు దేశం నుంచి తనకు ఆహ్వానం అందిందని, ఆపై కార్యకర్తలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
తన నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకే టిడిపిలో చేరుతున్నట్టు సుబ్బారావు ప్రకటించారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులకు తన వంతు సహకారాన్ని అందిస్తానని సుబ్బారావు చెప్పారు
Next Story