Fri Apr 26 2024 03:40:45 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి మరో నంద్యాల నేత
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి నాయకుడూ అవసరమే. తాజాగా నంద్యాల కు చెందిన మరోకీలక నేత వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం నంద్యాలకు చెందిన రాకేశ్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేశారు. అయితే రాకేశ్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని కోరగా అందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఆయన నేరుగా వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలోచేరారు. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు కూడా వచ్చి వైసీపీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ నంద్యాలలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- వైసీపీ
Next Story