Fri Mar 29 2024 07:41:51 GMT+0000 (Coordinated Universal Time)
సభ జరిపి తీరుతాం!
పోలీసులు అడుగడుగునా తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కన్నయ్య కుమార్ తెలిపారు. హైదరాబాద్కు చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం నిర్వహించే సభలో పాల్గొంటానని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. హెచ్సీయూకి వచ్చేందుకు కన్నయ్యకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. హెచ్సీయూలో మీడియాపై ఆంక్షలు విధించారు. పోలీసులు మీడియాను వర్సిటీలోకి అనుమతించట్లేదు. రాజకీయ నాయకులు, ఇతర విద్యార్థి సంఘాలకు కూడా హెచ్సీయూలోకి అనుమతిని నిరాకరించారు.
Next Story