Sat Apr 27 2024 03:43:24 GMT+0000 (Coordinated Universal Time)
సైకిలెక్కిన సీపీఐ నారాయణ...!
సీపీఐ నారాయణ ఏది చేసినా సంచలనమే. గాంధీజయంతి రోజున కోడికూర ఇడ్లీ తిని నారాయణ వార్తల్లోకెక్కారు. తాజాగా ఏపీ రాజాధాని అమరావతికి సైకిల్ మీద వచ్చారు. సీపీఐ నారాయణ ఉదయం సైక్లింగ్ చేసుకుంటూ ఏపీ సచివాలయానికి వచ్చారు. సచివాలయం చూసేందుకు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. బయట నుంచి చూసిన నారాయణ రాజధానిలో రోడ్లు బాగానే ఉన్నాయని కితాబిచ్చారు. ఆ తర్వాత నారాయణ అక్కడికి సమీపంలో ఉన్న తాటికల్లు తాగారు. రాజధానిని నిర్మించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, అయితే నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబుకు ఏడాది నుంచి అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా సర్దుకుపోతున్నారని నారాయణ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకుని కేంద్రంతో పోరాడి నిధులు తేవాలని కోరారు.
- Tags
- సీపీఐ నారాయణ
Next Story