Thu Mar 28 2024 12:20:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును టార్గెట్ చేసిన అడ్వకేట్ రామారావు..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేసిన అడ్వకేట్ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు చెందిన కంపెనీల వివరాలు కోరుతూ ఆయన ఆర్వోసీకి లేఖ రాశారు. హెరిటేజ్ కి చెందిన 20 కంపెనీల్లో ఫొరెన్సీక్ ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆర్వోసీని కోరారు. రేవంత్ రెడ్డిపైన కూడా అడ్వకేట్ రామారావు పలు వివరాలు సేకరించి ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇళ్లు, సంస్థల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story