Fri Mar 29 2024 02:38:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆనం రెడీగా ఉన్నారు....!
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరికొద్దిసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన నిన్ననే విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత ఆనం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నిన్న చోడవరంలోనే జగన్ ను రాత్రి శిబిరంలో కలసిన ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ విషయాలపై చర్చించారు. ఆనం తన భవిష్యత్తు గురించి కూడా జగన్ తో మాట్లాడినట్ల తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి తో పాటు ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూర్ రెడ్డి మరికొందరు పార్టీలో చేరారు. చోడవరం సమీపంలోని దేవరాయపల్లి మండలం వ్యాసంన చెరకు కాటా సెంటర్లో ఆనం వైసీీపీ కండువా కప్పుకోనున్నారు.
- Tags
- anam ramnarayana reddy
- anam rangamayur reddy
- andhra pradesh
- ap politics
- chodavaram
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఆనం రంగమయూర్ రెడ్డి
- ఆనం రామనారాయణరెడ్డి
- ఏపీ పాలిటిక్స్
- చోడవరం
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story