తెలంగాణ సర్కార్ పై ఏపీ ఆగ్రహం
తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాశారు. [more]
తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాశారు. [more]
తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నిగ్గు తేల్చాలని కోరింది. ఎన్ జీటీ ఆదేశించిన తర్వాత కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాల్సిన అవసరం ఏముందని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. కేఆర్ఎంబీ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు, రంగారెడ్డి, దిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని లేఖలో పేర్కొంది. తమ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.