Fri Apr 26 2024 07:01:05 GMT+0000 (Coordinated Universal Time)
మరో అవినీతి తిమింగలం
మహబూబ్నగర్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఇంటిపై శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇళ్లలోనూ ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. 20 తులాల బంగారం, లక్షల రూపాయల నగదుతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించారు. హైదరాబాద్లో మూడు చోట్ల, మహబూబ్నగర్, విశాఖపట్నంలో సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story