ప్రేమజంటపై జవాన్ దాడి...అత్యాచారయత్నం
ప్రేమ జంటపై ఓ జవాను దాడికి పాల్పడి విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన ఘటన తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ పికెట్ లక్ష్మీనగర్కు చెందిన యువతి (19) ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆమెకు తన అన్న మిత్రుడి కుమారుడి(20)తో పరిచయం ఏర్పడింది. శేఖర్ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది అమ్ముగూడ రైల్వేస్టేషన్ పరిధిలో ఇద్దరూ కలుసుకున్నారు. ఇది గమనించిన ఓ జవాను అక్కడకు వచ్చి లాఠీతో యువకుడిపై దాడి చేయడంతో పారిపోయాడు. అనంతరం ఆ యువతిని చెట్ల పొదల్లోకి లాక్కునిపోయే ప్రయత్నం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. చివరికి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే ఆమె 100కు డయల్ చేసింది.
ఇంతకుముందు కూడా ఇద్దరిపై...
అదే ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీ్స్ కానిస్టేబుల్ ఆ యువతి అరుపులు, కేకలు విని జవానును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతుండగా మరో కానిస్టేబుల్ చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా తన పేరు బ్రిజేష్ కుమార్ యాదవ్ అని, ఆర్మీ ఉద్యోగినని తెలిపాడు. యువతి, యువకుడు, కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా ఓ ఆర్మీ జవాన్ కూతురుని కూడా ఇదే ప్రాంతం లో రేప్ చేసాడు. పదో తరగతి విద్యార్ధి ట్యూషన్ వేళుతున్న సమయంలో దాడి చేసి రేపు చేసాడు. నాలుగు నెలలుగా పోలీస్ లు ఈ కేసు విచారణ చేస్తున్నారు. అయితే ఇపుడు బ్రిజేష్ దొరకడంతో డిఎన్ఏ టెస్ట్ చేసారు. ఈ రెండు కేసులో డీఎన్ఏ మ్యాచ్ కావడంతో ఆర్మీ జవాన్ బ్రిజేష్ ను పోలీస్ అరెస్ట్ చేసారు