Sat Apr 20 2024 10:24:50 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కే జై కొడతా....!!
ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖాయమయిపోయిందని, చంద్రబాబు ఇక ఇంటిబాట పట్టక తప్పదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. జగన్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని, జగన్ విజయం కోసం తాను ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రచారం చేయనున్నట్లు ఒవైసీ తెలిపారు. చంద్రబాబుకు ఈసారి ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. తెలంగాణలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదని, అదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా జరగనుందని ఆయన అన్నారు. తాను ఏపీలో జగన్ తరుపున ప్రచారం చేసి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని అసద్ హెచ్చరించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- asaduddin ovaisi
- janasena party
- mim
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అసదుద్దీన్ ఒవైసీ
- ఆంధ్రప్రదేశ్
- ఎంఐఎం
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story