Wed Apr 24 2024 18:49:05 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తులపై ఏపీ బీజేపీ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీజేపీ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీని భుజానికెత్తుకోవడం దారుణమన్నారు.
Next Story