Wed May 08 2024 11:41:07 GMT+0000 (Coordinated Universal Time)
రెండు పార్టీల నుంచి ఆఫర్లు
రాజకీయ ప్రవేశం గురించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను వారి పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆహ్వానించాయని, అయితే ఈ ఆహ్వానాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఏదైనా పార్టీలో చేరాలా లేదా కొత్త పార్టీ స్థాపించాలా అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున అన్ని అంశాలను ఆలోచించి తగిన వ్యూహంతో వస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో లక్ష్మీనారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన దృష్టి సారించారు.
Next Story