బాబు ఎయిర్ పోర్ట్ లో దిగగానే… వైసీపీ ప్లాన్ ఇదే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు విశాఖకు రానున్నారు. అయితే విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఆయనకు నిరసన సెగ తగిలే అవకాశముంది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించి తొలిసారి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు విశాఖకు రానున్నారు. అయితే విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఆయనకు నిరసన సెగ తగిలే అవకాశముంది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించి తొలిసారి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు విశాఖకు రానున్నారు. అయితే విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఆయనకు నిరసన సెగ తగిలే అవకాశముంది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించి తొలిసారి విశాఖకు వస్తున్న చంద్రబాబుకు నిరసన వ్యక్తం చేయాలని ఇప్పటికే వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటిస్తారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్రబాబుకు నిరసన తెలపాలని వైసీపీ పిలుపు నివ్వడంతో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు ఎటువంటి ఆందోళనలకు దిగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. పెద్దయెత్తున వైసీీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు చేరుకునే అవకాశముందని తెలుస్తోంది.