నిద్రలేని రాత్రులు గడుపుతారు.. బాబు వార్నింగ్
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జెన్ కో, ట్రాన్స్ కో లను దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. [more]
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జెన్ కో, ట్రాన్స్ కో లను దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. [more]
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జెన్ కో, ట్రాన్స్ కో లను దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. దేశంలో విద్యుత్తు సంస్కరణలను తెచ్చింది తానేనని చెప్పారు. పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని అభిప్రాయపడ్డారు. నాణ్యమైన తక్కువ ధరకు కరెంటు ఇవ్వాలని తాము ప్రయత్నించామని చెప్పారు. దురుద్దేశంతో విద్యుత్తు ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని ప్రశ్నించారు. తప్పుడు రికార్డులు చూపి తమపై నిందలు వేస్తున్నారన్నారు.
ఎవరు చెప్పినా జగన్….
ఎవరు చెప్పినా జగన్ వినరని, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇసుక రేటు తమ ప్రభుత్వ హయాంలో కన్నా రెండు రెట్లు పెరిగిందన్నారు. అడిగితే జగన్ సమాధానం చెప్పరా? అని అన్నారు. పేపర్ లీకుపై కూడా జగన్ స్పందించలేదన్నారు. జగన్ తప్పులు చేస్తే అధికారులు సమర్థిస్తారా? అని నిలదీశారు. అధికారులు మరోసారి జగన్ నిర్ణయాలకు తలూపితే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికారులు తమ పని చేయాలి తప్ప ఒక పార్టీ, ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి వంత పాడితే ఒప్పుకోమన్నారు. చాలా మంది భవిష్యత్తులో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించారు.