బ్రేకింగ్ : అసెంబ్లీ సమాశాలు ఎందుకు? వాయిదా వేయండి
విదేశాల నుంచి వచ్చిన వారిని ముందే క్వారంటైన్ చేయాల్సిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ హౌస్ క్వారంటైన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన [more]
విదేశాల నుంచి వచ్చిన వారిని ముందే క్వారంటైన్ చేయాల్సిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ హౌస్ క్వారంటైన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన [more]
విదేశాల నుంచి వచ్చిన వారిని ముందే క్వారంటైన్ చేయాల్సిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ హౌస్ క్వారంటైన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. కొన్ని ఆసుపత్రులను ఇన్సెంటివ్ క్వారంటైన్లుగా మార్చాలన్నారు. సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టెయిన్ చేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏపీలో ఈ ప్రక్రియ ఆలస్యంగా జరిగిందన్నారు. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా కొంత వరకూ ఈ వైరస్ ను నియంత్రించవచ్చన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనలను అందరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా వ్యవసాయం, హార్టీ కల్చర్, ఆక్వా కల్చర్ బాగా దెబ్బతినిందన్నారు. ప్రభుత్వం యాక్టివ్ అయితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మరోవైపు నిత్యావసరవస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు.
కేరళ, తెలంగాణ తరహా ప్యాకేజీలను….
ఇంటింటికీ వస్తువులు చేరవేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలన్నారు. పరిశుభ్రత పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరించారు. హుద్ హుద్ అప్పుడు తాము ఇచ్చిన ప్యాకేజీని ఇప్పుడు పేదలకు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేరళ, తెలంగాణలో ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేయడం మంచిదన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేయాలన్నారు. న్యాయనిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.