Thu Apr 25 2024 00:24:26 GMT+0000 (Coordinated Universal Time)
చినజీయర్ స్వామికి తప్పిన పెను ప్రమాదం
త్రిదండి చినజీయర్ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన గురువారం హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయ గోపురకలశ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన కట్టెలతో ఏర్పాటు చేసిన మెట్లను ఎక్కి గోపురంపై కలశాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తుండగా కర్రలు ఒక్కసారిగా విరిగిపోయాయి. ఆయన నిదానంగా కర్రల ద్వారా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story