Sat Apr 20 2024 06:39:26 GMT+0000 (Coordinated Universal Time)
టీపీ గూడెంలో చిరంజీవి
తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఆవిష్కరించారు. తనకు ఎస్వీ రంగారావు అంటే ఎంతో ఇష్టమన్నారు. ఆయన నటన, డైలాగులు ఎప్పటికీ [more]
తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఆవిష్కరించారు. తనకు ఎస్వీ రంగారావు అంటే ఎంతో ఇష్టమన్నారు. ఆయన నటన, డైలాగులు ఎప్పటికీ [more]
తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఆవిష్కరించారు. తనకు ఎస్వీ రంగారావు అంటే ఎంతో ఇష్టమన్నారు. ఆయన నటన, డైలాగులు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత తాడేపల్లి గూడెం రావడంతో పెద్దయెత్తున చిరంజీవి అభిమానులు తరలి వచ్చారు. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. చిరంజీవి వెంటే టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, ఈలి నాని తదితరులు ఉన్నారు. చిరంజీవి రాక సందర్భంగా తాడేపల్లి గూడెంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story