Fri Apr 26 2024 07:52:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ పై హత్యాయత్నం కేసులో కేంద్రం చర్యలు
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కేంద్రం ఓ అధికారిని బదిలీ చేసింది. విశాఖపట్నం ఎయిర్ పోర్టు సీఐఎస్ఎఫ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ ను చెన్నైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ పోర్టు లోపలికి కత్తి వెళ్లడం, జగన్ పై దాడి జరగడం పట్ల వేణుగోపాల్ ను బాధ్యుడిని చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది.
Next Story