Sat Apr 20 2024 03:43:24 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క ఊరికి మూడు కాంగ్రెస్ టిక్కెట్లు
కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి 65 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదత చేసింది. ఈ లిస్టులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ లిస్టులో నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన ముగ్గురు నేతలకు టిక్కెట్లు దక్కాయి. ఈ గ్రామానికి చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ టిక్కెట్ ఐదోసారి దక్కింది. ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టిక్కెట్ కేటాయించారు. ఇక వీరి అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కూడా నకిరేకల్ స్థానం దక్కింది. దీంతో ఒక్క గ్రామానికే మూడు టిక్కెట్లు దక్కినట్లయింది.
Next Story