Wed Apr 24 2024 11:23:59 GMT+0000 (Coordinated Universal Time)
పెరుగుతున్న సంఖ్య.. దేశానికి తాళం
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 560కి పెరిగాయి. మృతుల సంఖ్య 11కి చేరింది. తమిళనాడులో తొలి కరోనా మరణం సంభవించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయింది. తెలంగాణలో 39, [more]
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 560కి పెరిగాయి. మృతుల సంఖ్య 11కి చేరింది. తమిళనాడులో తొలి కరోనా మరణం సంభవించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయింది. తెలంగాణలో 39, [more]
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 560కి పెరిగాయి. మృతుల సంఖ్య 11కి చేరింది. తమిళనాడులో తొలి కరోనా మరణం సంభవించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయింది. తెలంగాణలో 39, ఆంధ్రప్రదేశ్ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ విస్తరించకుండా వివిధ రాష్ట్రాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. కేరళలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య వందకు దాటడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బీహార్ లో కూడా వ్యాధి విజృంభిస్తోంది.
Next Story