Sat Apr 20 2024 00:12:14 GMT+0000 (Coordinated Universal Time)
సచివాలయంలో సందడి... కారణమేంటీ..?
తెలంగాణలో రెపు అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ సచివాలయం బుధవారం సందడిగా మారింది. కేసీఆర్ సర్కారుకు ఇవాళే చివరి రోజు అనే ప్రచారంతో వివిధ పనులపై జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున సచివాలయానికి వచ్చి పనులు చేయించుకునేందుకు ప్రయత్నించారు. సాధారణంలో తెలంగాణ సచివాలయానికి ప్రతీ రోజుల 500 నుంచి 1000 మంది వచ్చేవారు. ఇవాళ ఏకంగా సుమారు ఐదు వేల మంది వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Next Story