Thu Apr 25 2024 20:49:48 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లోనే సోదాలు
కర్ణాటకలో ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలీకాఫ్టర్ లో సోదాలు చేసిన [more]
కర్ణాటకలో ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలీకాఫ్టర్ లో సోదాలు చేసిన [more]
కర్ణాటకలో ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలీకాఫ్టర్ లో సోదాలు చేసిన అధికారులు ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామి హెలీకాఫ్టర్ లోనూ సోదాలు జరిపారు. శివమొగ్గలో ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన హెలీకాఫ్టర్ ను అధికారులు సోదాలు చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిన్న మాండ్యా, హసన్ జిల్లాల్లోనూ జేడీఎస్ టార్గెట్ గా ఎన్నికల సంఘం సోదాలు జరిపింది. అయితే, కక్షపూరితంగా జేడీఎస్ నేతలను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల సంఘం తమపైనే దాడులు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story