Thu Mar 28 2024 20:21:26 GMT+0000 (Coordinated Universal Time)
గాలి ఫ్యామిలీకే టిక్కెట్
చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడి సతీమణి సర్వతమ్మకు టిక్కెట్ ను చంద్రబాబు ఖరారు చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడి మృతితో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఎవరికివ్వాలన్న దానిపై చంద్రబాబు గాలి కుటుంబ సభ్యులతో చర్చించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుమారులు భానుప్రకాశ్, జగదీష్ లు ఇద్దరూ తమకే కేటాయించాలని పోటీ పడటంతో మధ్యే మార్గంగా గాలి సతీమణి సరస్వతమ్మకు టిక్కెట్ ను చంద్రబాబు ఖారారు చేశారు.
Next Story