బిల్డ్ ఏపీ ఆక్షన్ గడువు పెంపు
బిల్డ్ ఏపీ మిషన్ కింద రాష్ట్రంలో ఇ-ఆక్షన్ కు పెట్టిన భూముల అమ్మకాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, గుంటూరులలోని భూముల ఇ-ఆక్షన్ ను [more]
బిల్డ్ ఏపీ మిషన్ కింద రాష్ట్రంలో ఇ-ఆక్షన్ కు పెట్టిన భూముల అమ్మకాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, గుంటూరులలోని భూముల ఇ-ఆక్షన్ ను [more]
బిల్డ్ ఏపీ మిషన్ కింద రాష్ట్రంలో ఇ-ఆక్షన్ కు పెట్టిన భూముల అమ్మకాల తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, గుంటూరులలోని భూముల ఇ-ఆక్షన్ ను జూన్ 11 తేదీ వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ విశాఖలో 6 స్థలాలు, గుంటూరులో 3 స్థలాలను తొలిదశలో విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇ-ఆక్షన్ తేదీని పొడిగించాలంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్ధలన మేరకు మరో 15 రోజుల పాటు పొడిగించింది. బిల్డ్ ఏపీ మిషన్ ఇ-ఆక్షన్ లో విక్రయించదలచిన 9 స్థలాల ఫోటోలను, వివరాలను ఎన్ బీసీసీ ఇండియా డాట్ కామ్, లేదా ఏపీ గవ్ డాట్ ఇన్ లో తెలుసుకోవచ్చని ప్రకటించారు. మరింత మంది ఆక్షన్ లో పాల్గొనేందుకు తేదీని పొడిగించామని ప్రభుత్వం తెలిపింది.