
అవినీతి నిరోధక శాఖ దాడుల ఫలితంగా విజయవాడ దుర్గగుడిలో 13 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మూడు రోజులు జరిపిన సోదాల్లో అనేక విభాగాల్లో అవినీతి జరిగిందని తేలింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అన్నదానం, చీరల విక్రయాలు వంటి చోట్ల పెద్దయెత్తున అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్ శాఖలో కూడా అవినీతి ఉందని తేల్చింది. దీంతో దుర్గగుడిలో వివిధ శాఖలకు చెందిన 13 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
Leave a Reply