Fri Mar 29 2024 06:15:25 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు హర్ష డెడ్ లైన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. అమాయకులైన దళితులు సాగు చేస్తున్న భూములను ఏపీ మంత్రులు బెదిరించి మరీ కొనుగోలు చేశారని, అందుకు తగిన సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని తెలిపారు. ఈ భూదోపిడీపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లించారు. దళితులకు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చోటు లేకుండా చేశారన్నారు. పదిహేను రోజుల్లో దళితుల అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేయకుంటే తాను ఆమరణదీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. అమరావతి భూములను రైతులు ఉచితంగా ఇస్తే వాటిని సింగపూర్ కంపెనీలకు బాబు తాకట్టు పెట్టారన్నారు. అమరావతిలో పెద్దయెత్తున భూ కబ్జాలు జరిగాయని ఆరోపించారు.
Next Story