హైపవర్ మరోసారి…?
హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ నెల 17వ తేదీన మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ నెల 17వ తేదీన మరోసారి [more]
హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ నెల 17వ తేదీన మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ నెల 17వ తేదీన మరోసారి [more]
హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ నెల 17వ తేదీన మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ నెల 17వ తేదీన మరోసారి సమావేశం అవ్వాలని హై పవర్ కమిటీ నిర్ణయించింది. ఎవరైనా రైతులు తమ అభ్యంతరాలను, సూచనలను తెలియజేయాలంటే ఈ నెల17వ తేదీ సాయంత్రంలోగా సీఆర్డీఏకు పంపాలని కోరారు. రాజకీయ లబ్ది కోసం తెలుగుదేశం పార్టీ మహిళలను, రైతులను వాడుకుంటోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రాజధానిలో నిజమైన రైతులకు తమ మాటలు అర్థమవుతాయన్నారు. వ్యక్తిగతంగా తమను రైతులు కలుస్తున్నారని చెప్పారు. మంత్రులను కలసి రైతులు తమ ప్రతిపాదనలను చెప్పారన్నారు. చంద్రబాబు తన బాధను ప్రపంచానికి బాధలాగా ఉండాలని భావిస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. లేని ఉద్యమాలను ప్రేరేపిస్తున్నారన్నారు. పండగపూటయినా ఉద్యమాలకు స్వస్తి పలకాలని చెప్పారు. డీజీపీని అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. ధర్నాల వెనక ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ హస్తం ఉందన్న సంగతి అందరికీ తెలుసునన్నారు.