Fri Apr 19 2024 20:54:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆర్టీసీ బస్సులు లేవు.. వెనక్కు తగ్గిన జగన్ సర్కార్
నేటి నుంచి హైదరాబాద్ టు ఏపీ ఆర్టీసీ బస్సులు నడపాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాంకేతిక సమస్యలతో దీనిని వాయిదా వేసింది. హైదరాబాద్ లో చిక్కుకుపోయిన [more]
నేటి నుంచి హైదరాబాద్ టు ఏపీ ఆర్టీసీ బస్సులు నడపాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాంకేతిక సమస్యలతో దీనిని వాయిదా వేసింది. హైదరాబాద్ లో చిక్కుకుపోయిన [more]
నేటి నుంచి హైదరాబాద్ టు ఏపీ ఆర్టీసీ బస్సులు నడపాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాంకేతిక సమస్యలతో దీనిని వాయిదా వేసింది. హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను సొంత రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు నేటి నుంచి ఏపీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 13 వేల మందిని తరలించేందుకు అంతా సిద్ధం చేసింది. అయితే ప్రత్యేక బస్సులను నడపడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. త్వరలో ఎప్పుడు నడిపేది తెలియజేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నాల్గో విడత లాక్ డౌన్ నిబంధనలను వెల్లడించిన తర్వాత బస్సులు తిరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
Next Story