జమ్మలమడుగు తరహాలోనే ఆళ్లగడ్డ
అమరావతిలో ఆళ్లగడ్డ పంచాయతీ ప్రారంభమయింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. అయితేచంద్రబాబు ఆళ్లగడ్డ విషయంలో జమ్మలమడుగు వ్యూహాన్ని అమలుపర్చబోతున్నట్లుతెలుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నప్పుడు తొలుత చంద్రబాబు వారిద్దరితో విడివిడిగా సమావేశమయ్యారు. ఇద్దరికీ సర్దిచెప్పిన తర్వాత కలిపి కూర్చోబెట్టి జమ్మల మడుగు పంచాయతీని చంద్రబాబు పరిష్కరించగలిగారు. ఇప్పుడు ఆళ్లగడ్డలోనూ అదే వ్యూహాన్ని చంద్రబాబు అమలుపర్చబోతున్నట్లు సమాచారం. ఏవీ సుబ్బారెడ్డితో కలసి సమావేశంలో కూర్చునేందుకు కూడా అఖిలప్రియ ఇష్టపడటం లేదు. అఖిలప్రియ, ఏవీసుబ్బారెడ్డిలు ఇద్దరూ అమరావతి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. విడివిడిగా వీరితో మాట్లాడిన తర్వాత కలిసి కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆళ్లగడ్డ పంచాయతీ పరిష్కారం అవుతుందో లేదో చూడాలి.