Sat Apr 20 2024 09:56:59 GMT+0000 (Coordinated Universal Time)
తరలింపును బీజేపీ అడ్డుకుంటుంది
రాజధానిని అమరావతి నుంచి తరలింపు ప్రక్రియను బీజేపీ అడ్డుకుంటుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పరిపాలన అంతా ఒకే ప్రాంతం నుంచి జరగాలని కామినేని [more]
రాజధానిని అమరావతి నుంచి తరలింపు ప్రక్రియను బీజేపీ అడ్డుకుంటుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పరిపాలన అంతా ఒకే ప్రాంతం నుంచి జరగాలని కామినేని [more]
రాజధానిని అమరావతి నుంచి తరలింపు ప్రక్రియను బీజేపీ అడ్డుకుంటుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పరిపాలన అంతా ఒకే ప్రాంతం నుంచి జరగాలని కామినేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో రాజధాని రైతులతో కలసి ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన వివరించారు. ఢిల్లీ పెద్దలను కలసి రాజధాని అమరావతి ఆవశ్యకతను గురించి వివరిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణచేయవచ్చు గాని, పాలనా వికేంద్రీకరణ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు కామినేని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు.
Next Story