కాపు ఓట్లపై కన్నేసి....!
కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంటులో ఆందోళన చేస్తోన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పుడు కాపురిజర్వేషన్ల పై కన్ను వేశారు. ఇందులో భాగంగా ఈరోజు కాపు రిజర్వేషన్లపై తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లడానికి తెలుగుదేశం ఈ ప్రయత్నం చేస్తోంది.
చర్చ జరుగుతుందనే.....
నిన్ననే ఓబీసీ బిల్లును పార్లమెంటులో ప్రభుత్వం పాస్ చేసింది. ఇకపై ఎవరికి రిజర్వేషన్లు వర్తించాలన్నా ఓబీసీ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతనే రిజర్వేషన్లను అమలు చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశం ఎత్తేంత వరకూ ఊసే ఎత్తని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పార్లమెంటులో ప్రయివేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టబోతోంది. ఓబీసీ అంశంపై నిన్న పార్లమెంటులో జరిగిన అంశంపై జరిగిన చర్చలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎత్తివేశారు.