Thu Apr 25 2024 10:41:59 GMT+0000 (Coordinated Universal Time)
బాబుపై రెబల్ స్టార్ ఫైర్
రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఒకరోజు ఉప వాస దీక్ష చేస్తున్న చంద్రబాబు మోడీ చేసినప్పుడు ఎందుకు విమర్శించారని రెబెల్ స్టార్, బీజేపీ నేత కృష్ణంరాజు విమర్శించారు. చంద్రబాబు దీక్షను ఆయన తప్పుపట్టారు. జీడీపీ పెరిగిందని ఒకపక్క చెబుతూ కేంద్రం రాష్ట్రానికి అన్యాయంచేసిందంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కర్ణాటక వెళ్లి బీజేపీకి ఓట్లు వెయొద్దని టీడీపీ నేతలు ఎలా చెబుతారన్నారు. కేంద్ర వల్లనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీకి రైల్వే జోన్ వచ్చితీరుందని, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని మాటమార్చడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
Next Story