Thu Apr 25 2024 04:13:14 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను టార్గెట్ చేసే.... దాడి....!
ఇది జగన్ ను టార్గెట్ చేసుకున్న దాడేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు భుజం పై కాకుండా మెడపై కత్తి తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ సానుభూతి కోసం ఈ దాడిచేయించుకున్నాడని టీడీపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. దాడి జరిగిన వెంటనే డీజీపీ ప్రకటనచేయడం కూడా తమ అనుమానాలకు కారణమయిందన్నారు. జగన్ హుందాగా ప్రవర్తించినా, చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. అందుకే ధర్డ్ పార్టీ సంస్థతో ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేయాలని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. డీజీపీ తొలుత విచారణ కు ఆదేశించకుండా ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారన్నది నిలకడమీద తెలుస్తుందన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- attack
- dharmana prasadarao
- knife
- mekapati rajamohanreddy
- nara chandrababu naidu
- telugudesam party
- visakha airport
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కత్తి
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- ధర్మాన ప్రసాదరావు
- నారా చంద్రబాబునాయుడు
- మేకపాటి రాజమోహన్ రెడ్డి
- విశాఖ ఎయిర్ పోర్టు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story