Thu Apr 25 2024 00:33:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆ.. ఎంపీ కొత్త పార్టీ
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో కొత్త పార్టీ ఆవిర్భవిచింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత శుక్రవారం విజయవాడలో పార్టీ పేరు, జెండాను విడుదల చేశారు. పార్టీకి జన జాగృతి పార్టీ ని పేరు పెట్టారు. నీలం, తెలుపు రంగుతో కూడిన జెండా మధ్య గొడుగును ఉంచారు. ‘మార్పు కోసం ముందడుగు’ అనేది పార్టీ నినాదమని ఆమె ప్రకటించారు. డిప్యూటీ కలెక్టర్ గా, ఎంపీగా పనిచేసిన తనకు రాష్ట్ర సమస్యలు తెలుసని, తన పార్టీలో అన్నివర్గాల వారికీ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పనిలో పనిగా ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 2014లో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. అటు నుంచి కొన్నిరోజులు తెలుగుదేశంకి అనుబంధంగా పనిచేసి... మళ్లీ దూరం జరిగిన విషయం తెలిసిందే.
Next Story