Thu Mar 28 2024 13:25:06 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానితో నిర్మల భేటీ? కీలక నిర్ణయం?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో వలసకూలీలది సమస్యగా [more]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో వలసకూలీలది సమస్యగా [more]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో వలసకూలీలది సమస్యగా మారింది. ఉపాధి కరవు కావడంతో వారు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్చించడానికి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలుంటాయని చెబుతున్నారు.
Next Story