Fri Apr 26 2024 03:56:24 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులకు అన్నీ బంద్
తమ ఆందోళనలను అడ్డుకుంటున్న పోలీసులకు రాజధాని రైతులు విన్నూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై గత 27 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. [more]
తమ ఆందోళనలను అడ్డుకుంటున్న పోలీసులకు రాజధాని రైతులు విన్నూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై గత 27 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. [more]
తమ ఆందోళనలను అడ్డుకుంటున్న పోలీసులకు రాజధాని రైతులు విన్నూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై గత 27 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు తమ గ్రామాల్లో కూర్చోకుండా బల్లలపై ఆయిల్ పూశారు. అలాగే వారికి టిఫిన్లు, భోజన సదుపాయాలు కల్పించవద్దని వ్యాపారులను కూడా గ్రామస్థులు కోరారు. కనీసం పోలీసులకు మంచినీరు కూడా అందించవద్దని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయించారు. తమను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులకు కనీసం కూర్చునేందుకు వీలు లేకుండా చేసి గ్రామస్థులు నిరసన తెలియజేస్తున్నారు.
Next Story