జగన్ రెడ్డి….జాగో
ఆరునెలల విలువైన కాలాన్న ముఖ్యమంత్రి జగన్ వృధా చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆరు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కూల్చివేయడం, కాంట్రాక్టులు రద్దు [more]
ఆరునెలల విలువైన కాలాన్న ముఖ్యమంత్రి జగన్ వృధా చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆరు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కూల్చివేయడం, కాంట్రాక్టులు రద్దు [more]
ఆరునెలల విలువైన కాలాన్న ముఖ్యమంత్రి జగన్ వృధా చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆరు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కూల్చివేయడం, కాంట్రాక్టులు రద్దు చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు పవన్ కల్యాణ్. చిత్తూరు జిల్లా మదన పల్లె టమాటా మార్కెట్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు. 75 రోజులు కష్టపడితే గాని టమాటా పంట చేతికి రాదన్నారు. తాను మదనపల్లెకి వస్తానంటే అనుమతి ఇవ్వలేదన్నారు. తనను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు మీకు ఉంటే లక్షలాది మంది జనం మా వెంట ఉన్నారన్నారు. రైతుల కడుపును వైసీపీ ప్రభుత్వం కొడుతుందన్నారు. పాదయాత్రలో రైతుల సమస్యలు తెలియరాలేదా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. జగన్ రెడ్డికి మతమార్పిడుల మీద ఉన్న ఉత్సాహం రైతులకు ప్రయోజనాలు చేకూర్చడంలో లేదన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలు పరిష్కరించకుంటే మరో మహా ప్రదర్శన నిర్వహిస్తానన పవన్ కల్యాణ్ చెప్పారు.