Sat Apr 20 2024 00:13:54 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాను కలిసిన పవన్ కల్యాణ్.. తిరుపతి ఉప ఎన్నికలో?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షా ను కలిశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనీ ప్రయివేటు పరం చేయవద్దని పవన్ కల్యాణ్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షా ను కలిశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనీ ప్రయివేటు పరం చేయవద్దని పవన్ కల్యాణ్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షా ను కలిశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనీ ప్రయివేటు పరం చేయవద్దని పవన్ కల్యాణ్ అమిత్ షాను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల సెంటిమెంట్ అని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేప్టివ్ మైన్స్ ను కేటాయించాలని, ప్లాంట్ ఆర్థికంగా పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పడాలని పవన్ కల్యాణ్ కోరారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ కోరినట్లు తెలిసింది.
Next Story