Fri Apr 19 2024 08:59:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే కారుపై దాడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రాజధాని రైతులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలు పగుల కొట్టారు. గత ఇరవై రోజులుగా రాజధానిని అమరావతిలోనే [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రాజధాని రైతులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలు పగుల కొట్టారు. గత ఇరవై రోజులుగా రాజధానిని అమరావతిలోనే [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రాజధాని రైతులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలు పగుల కొట్టారు. గత ఇరవై రోజులుగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఏడోనెంబరు జాతీయ రహదారి దిగ్భంధనానికి కూడా పిలుపు నిచ్చారు. అయితే ఆ సమయంలో అటు వైపు వస్తున్న ఎమ్మెల్యే పిిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై వాటర్ ప్యాకెట్లు, రాళ్లతో ఆందోలనకారులు దాడికి దిగడంతో ఆయన కారు అద్దాలు పగిలాయి. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆయనను సురక్షితంగా బయటకు పంపించి వేశారు.
Next Story