బ్రేకింగ్ : రాహుల్ కి నో ఎంట్రీ
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వీసీ షాక్ ఇచ్చారు. ఆయన సభకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 13, 14వ తేదీల్లో హైదరాబాద్ లో రాహుల్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే క్యాంపస్ లో విద్యార్థులతో సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. ఈ మేరకే అనుమతి కోసం కాంగ్రెస్ అనుబంధ విద్యాసంస్థ ఎన్ఎస్ యూఐ నేతలు వీసీని కలిసి కోరారు. అయితే, రాహుల్ కు అనుమతి ఇవ్వవద్దని టీఆర్ఎస్వీ నేతలతో పాటు పలు విద్యార్థి సంఘాలు కోరాయి.
వీసీ నిరాకరణ.....
క్యాంపస్ లో రాహుల్ రాకకు నిరసనగా ర్యాలీ కూడా నిర్వహించారు. ఇదే సమయంలో రాహుల్ రాకకు అనుకూలంగా ఎన్ఎస్ యూఐతో పాటు పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా పోటీ ర్యాలీ నిర్వహించారు. మొత్తానికి రాహుల్ రాకకు నో చెప్పడంతో కాంగ్రెస్ కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. ఆర్ట్స్ కాలేజీ లేదా ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో కచ్చితంగా సభను నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.